పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సత్కారం

71చూసినవారు
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సత్కారం
కాట్రేనికోన మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లం నందు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందుతున్న పోలవరపు సత్యసాయిబాబు దంపతులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ, విద్యార్థి బృందం ఘనంగా సన్మానించారు. 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన సేవలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్మెస్ కేఆర్ఎం కుమార్ కొనియాడారు. అంకిత భావం, సేవాభావంతో పనిచేసిన సాయిబాబు అందరికీ ఆదర్శనీయులని పలువురు ఉపాధ్యాయులు అన్నారు.

సంబంధిత పోస్ట్