కాట్రేనికోన గ్రామదేవత మావుళ్లమ్మతల్లి ఆలయంలో నిత్యపూజల నిమిత్తం కొత్తపాలెంకు చెందిన హరివిల్లా నిర్మాణ సంస్థ ఆధినేత సుంకర పవిత్ర మంగళవారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 20 వేలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పవిత్ర కుమార్ దంపతులను ఆశీర్వదించి దన్యవాదాలు తెలియజేశారు. దేవాలయాల దూప దీప నైవేద్యాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.