పల్లెపండుగతో గ్రామీణ రహదారులకు మహర్థశ

68చూసినవారు
పల్లె పండుగ పేరిట కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం మాధవపట్నంలో రు.85లక్షల కేంద్ర నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవారం కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. కూటమి నాయకులు తుమ్మల బాబు, వెంకటరమణ, పెంకే వెంకటేష్, చీకట్ల వెంకటేష్, కుర్రా రాజు, వీరభద్ర సుగుణమ్మలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్