రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన రాజోలు విద్యార్థులు

73చూసినవారు
రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపి కళాశాలకు పేరు తీసుకురావాలని రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతకుమారి అభిలాషించారు. అండర్-19 జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. మౌనిక (యోగ), యజ్ఞేశ్వరి (విలువిద్య), ధర్మ (బాక్సింగ్) రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. గోపాలకృష్ణ, పీడీ మధుకుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్