సఖినేటిపల్లి: దాతలు నిర్మించిన ఇంటిని అప్పగించిన ఎమ్మెల్యే

54చూసినవారు
మానవతామూర్తులు ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటిని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం సఖినేటిపల్లి మండలం మోరికి చెందిన శేషారత్నంకు స్వాధీనం చేశారు. భర్త అనారోగ్యంతో మృతి చెందగా ఇద్దరు పిల్లలతో నీడ లేకుండా శేషారత్నం ఇబ్బంది పడుతోంది. ఆమె పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాతలు స్పందించారు. దాతల విరాళాలతో నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే స్వాధీనం చేశారు. విరాళాలు అందించిన దాతలను ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్