చల్లపల్లిలో భారీ చోరీ
చల్లపల్లి నారాయణరావునగర్లో భారీ చోరీ జరిగింది. శివకృష్ణ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుండగా, భార్య నవ్యశ్రీ పిల్లలతో కలిసి నారాయణరావునగర్ లో నివసిస్తోంది. సోమవారం మెరకనపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. గురువారం ఇంటికివచ్చి చూడగా, తలుపుకు వేసిన తాళం పగలకొట్టి ఉంది. హారం, నల్లపూసల గొలుసు, గాజులు, చెవిదిద్దులు, నాంతాడు, పిల్లల గొలుసులు, ఉంగరాలు, వెండి కాలిపట్టాలు, రూ. 65వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు.