నిమజ్జనోత్సవంలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు
మోపిదేవి మండల పరిధిలోని పోచిగానిలంకలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనోత్సవంలో గురువారం సాయంత్రం ఘర్షణ జరిగి ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాపు సామాజిక వర్గీయులు ఏర్పాటుచేసిన నిమజ్జోత్సవ ర్యాలీలో రహదారికి అడ్డుగా వాహనాలు ఉండడంతో వెంకటేశ్వరరావు, సాయిరామ్ అడ్డు తీయమని అడిగారు. దీంతో గొడవ జరిగి ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.