మైలవరం: దుర్గమ్మకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు

83చూసినవారు
వరప్రదాయిని, శక్తిస్వరూపిణి, శ్రీదుర్గాదేవి అమ్మవారికి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, శిరీష దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుని కార్యాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్