జూపూడి కేలేశ్వరపురం గ్రామాల్లో ఎన్డీఏ విజయోత్సవ ర్యాలీ

85చూసినవారు
జూపూడి కేలేశ్వరపురం గ్రామాల్లో ఎన్డీఏ విజయోత్సవ ర్యాలీ
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి, కిలేశపురం గ్రామాల్లో ఎన్డీఏ మహాకూటమి విజయోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ ర్యాలీ నిర్దేశించి ఎమ్మెల్యే కొద్దిసేపు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్