విజయవాడ: నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలి హోం మంత్రి

72చూసినవారు
విజయవాడ: నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలి హోం మంత్రి
గత ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన మైనర్ బాలుడు ఉప్పాల అమర్ నాథ్ కుటుంబానికి న్యాయం చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 16 ఏళ్ల తమ చిన్నారి అమర్ నాథ్ ని గతేడాది పెట్రోల్ పోసి నిప్పంటించారంటూ బాధిత కుటుంబం, గౌడ సేన నాయకులు హోం మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిందితులకు శిక్షపడేలా చూడాలని హోం మంత్రికి శుక్రవారం విజయవాడలో వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్