ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న బాలికపై అదే పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారంటూ బుధవారం బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు దాడికి యత్నం చేశారు. మంగళవారం బాలిక పట్ల ప్రధానోపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించటంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లితండ్రులకు విషయం తెలియజేసింది. పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడిపై దాడికి యత్నించారు.