ధ్వంసమైన మత్స్య భవనం ప్లాట్ ఫారమ్ ను పునర్నిర్మించాలి

85చూసినవారు
ధ్వంసమైన మత్స్య భవనం ప్లాట్ ఫారమ్ ను పునర్నిర్మించాలి
నాగాయలంక పడవల రేవు వద్ద ఉధృత వరదలు కారణంగా ధ్వంసమైన మత్స్య కారుల భవనం ప్లాట్ ఫారమ్ ను పునర్నిర్మించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి లకనం నాగాంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన స్థానిక మత్స్యకార సంఘాల నాయకులతో కలసి ధ్వంసమైన ప్లాట్ ఫారమ్ ను పరిశీలించారు. మత్స్యభవనం స్లాబ్, ఫిల్లర్లు, అప్రోచ్ రోడ్డు కూడ దెబ్బతిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు

సంబంధిత పోస్ట్