జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

2272చూసినవారు
గన్నవరం నియోజకవర్గ ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో సోమవారం వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్, వైసిపి నాయకులు డాక్టర్ కోసుల శివ భారత్ రెడ్డి కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసిపి కార్యకర్తలు వీరికి ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై ఇద్దరు ఓట్లు వేయమని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్