పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులే కాదు వన్యప్రాణులూ తల్లడిల్లిపోతున్నాయి. వేడి గాలుల తీవ్రతకు ఇబ్బందిపడుతున్న పక్షుల సంరక్షణకు ఢిల్లీలోని చాందినీ చౌక్లో ఉన్న ఛారిటీ బర్డ్స్ ఆస్పత్రి నడుం కట్టింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, వ్యాధుల బారిన పడి ఆస్పత్రికి తీసుకొచ్చిన పక్షులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోజు రోజుకీ ఎండ తీవ్రత ఎక్కువవుతుండటంతో పక్షుల కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు.