భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు నడవాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమని కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు కీర్తి వెంకట రామ్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కైకలూరులో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరుసగా ఇంత వరకు ఏ పార్టీ మూడోసారి గెలవలేదని, నేడు బీజేపీ నెగ్గి చరిత్ర సృష్టించిందన్నారు.