నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం టిడిపి గుండాల దాడిలో గాయాల పాలైన వైసిపి కార్యకర్తలు వినుకొండ రామారావు, షేక్ కాజా లను ఎమ్మెల్సీ డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ పరామర్శించి, ఏ. సి. పి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై ఎటువంటి దాడులకు దిగుతారో ఎంత అవమానకరంగా దూషిస్తారో ఈ ఘటన ఒక ఉదాహరణ అన్నారు.