రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

6930చూసినవారు
నూజివీడు పోలీసు సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండలం అడవి నక్కల గ్రామంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా వైన్ షాప్ ఎదురుగా ద్విచక్ర వాహనాలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్