గత మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం: జగన్

410478చూసినవారు
గత మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం: జగన్
2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరిట మేనిఫెస్టోను విడుదల చేశామని సీఎం జగన్ అన్నారు. 99 శాతం హామీలు నెరవేర్చామన్నారు. డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.68 లక్షల కోట్లు జమ చేశామన్నారు. నాన్ డీబీటీ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.78 లక్షల కోట్లు, అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.12,609 కోట్లు, వైఎస్సార్ భరోసా కోసం రూ.34,378 కోట్లు ఖర్చు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్