మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన కలెక్టర్‌

366చూసినవారు
మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన కలెక్టర్‌
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ రాజాబాబు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతి, నాడు - నేడు, గృహనిర్మాణం, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. వీసీలో జేసీ అపరాజితాసింగ్‌ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్