కొనకళ్లను కలిసిన కంకిపాడు నేతలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను కంకిపాడుకి చెందిన టిడిపి మహిళ నేతలు అన్నవరపు శివపార్వతి, కళ్యాణిలు ఆదివారం పరామర్శించారు. అలాగే కంకిపాడు మండలం ఈడుపుగల్లు గాంధీనగర్ మసీద్ లో కొనకళ్ల కోలుకోవాలని కోరుతూ సీనియర్ నేత షేక్ సలీమ్ ఆధ్వర్యంలో షేక్ సుభాన్, వలి, షేక్ మౌలాలి, షేక్ మస్తాన్ లు ప్రత్యేకంగా దువా నిర్వహించారు.