ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు భరోసా కల్పిస్తూ మంగళవారం గంపలగూడెం స్థానిక పోలీస్ ఎస్సై శ్రీను ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు.
గంపలగూడెం ప్రధాన రహదారిలో గాంధీ సెంటర్ నుంచి తోటమాల వరకు కవాతు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు పోలీసులు కవాతు నిర్వహిస్తున్నట్లు పోలీస్లు తెలిపారు.