వైభవంగా ప్రారంభమైన సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు

55చూసినవారు
వైభవంగా ప్రారంభమైన సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు
గంపలగూడెం మండలం పెనుగొలను శిరిడి సాయిబాబా మందిరంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులచే సాయిబాబా వెండి విగ్రహానికి 54 కేజీలు పంచదారతో అభిషేకము నిర్వహించారు. షిరిడి, సత్య సాయి బాబా చిత్రపటాలు పల్లకి లో ఉంచిపల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు తిరువూరు సత్య సాయి బాబా, కన్వీనర్ ప్రభాకర్ రావు, ఆర్గనైజర్ వరప్రసాద్ కు శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్