రాష్ట్ర అభివృద్ధి కోరుతూ
టీడీపీ,
జనసేన,
బీజేపీ కూటమి ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిందని, ప్రజలు గమనించి రాష్ట్ర వినాశనాన్ని కోరే వారికి కాకుండా అభివృద్ది కోరే వారికి ఓట్లు వేయాలని ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొ న్నారు. గుడివాడలోని 30,22, 21, 25 వార్డుల్లో మంగళవారం
టీడీపీ,
జనసేన విస్తృత ప్రచారం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యమే పట్టణంలో త్రాగునీటికి కారణమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి
వైసీపీ నాయకులు ఆస్తులు పెంచుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లు, డ్రెయిన్ల పనులు ప్రారంభిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వ రరావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాస రావు,
జనసేన భాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ
టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, పిన్నమనేని బాబి,
జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, 30, 22, 21, 25 వార్డుల
టీడీపీ,
జనసేన నాయకులు పాల్గొన్నారు.