వినాయక నిమజ్జన బావికి గేటు ఏర్పాటు

71చూసినవారు
కోడుమూరులో వినాయకులను నిమజ్జనం చేసే బావికి శుక్రవారం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నూతన గేటును ఏర్పాటు చేశారు. స్థానిక శివశక్తి బృందం సభ్యులు గేటు ఏర్పాటుకు రూ. 80వేలు అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టిగణపతులను ప్రతిష్టించాలని కోరారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి, శివశక్తి బృందం సభ్యులు నాగేశ్వరరావు, ఈశ్వరరెడ్డి, వేణుగౌడ్, కిశోర్, విజయ్, రాంప్రసాద్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్