బిందు సేద్యానికి సబ్సిడీపై పరికరాలు అందిస్తాం: ఏవో

69చూసినవారు
సాగులో తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించాలని కోడుమూరు ఏవో రవిప్రకాష్ సూచించారు. కోడుమూరులో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో నిర్వహించి, మాట్లాడారు. పత్తి, కంది పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. బోరు బావులున్న రైతులు ముందుకొస్తే బిందు సేద్యానికి అవసరమైన పరికరాలను సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్