ఇండియా కూటమితోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని ఇండియా కూటమి అభ్యర్థి మురళి కృష్ణరాజు దొర స్పష్టం చేశారు. శనివారం పెద్దకడబూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొమ్మిది గ్యారంటీల పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల హస్తం గుర్తుకు రెండు ఓట్లు వేయాలని కోరారు.