11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి

71చూసినవారు
11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో రామచంద్ర (గోనెగండ్ల పీఎస్), ఎన్. ఈరన్న (గూడూరు పీఎస్), గిడ్డయ్య గౌడు (హాలహర్వి పీఎస్), జి. పాండు రంగస్వామి (పాణ్యం పీఎస్), ఎం. సిఖిందర్ మిర్జా (కర్నూలు టూటౌన్ పీఎస్), బాలరాజు (డీఎస్బీ, కర్నూలు)లుతో పాటు పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్