ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంద‌రికీ సీటు ఇవ్వాలి

51చూసినవారు
ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంద‌రికీ సీటు ఇవ్వాలి
అత్యంత వెనుక‌బ‌డిన ఆదోని ప్రాంతంలోని దరఖాస్తు చేసుకున్న‌ ప్రతి విద్యార్థికి బిసి హాస్ట‌ల్‌లో సీటు ఇవ్వాల‌ని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయ‌కులు అబ్దుల్లా, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ‌నివారం బీసీ వెల్ఫేర్ డిడి వెంకటలక్ష్మికి వినతి పత్రం అందించిన‌ట్లు ఆదోని విలేక‌రుల‌కు తెలిపారు. సీటు దొర‌క్కా విద్య‌ను మానేసే ప‌రిస్థితి ఉంద‌న్నారు. ప్రతినెల మెడికల్ క్యాంప్, సొంత భవనాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు తీర్చాల‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్