రుద్రవరం మండల తహసీల్దారు కార్యాలయం ముందు నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మె 33వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బాల వెంకట్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, అంగన్వాడి నాయకురాళ్ళు మనోజ, పద్మావతి, బీబి తదితరులు ఉన్నారు.