తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

66చూసినవారు
తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. మంగళవారం 8, 106 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోందని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 57 టీఎంసీల నిల్వ ఉందన్నారు. 10, 088 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్