ఆలూరు మండలంలోని కురుకుంద గ్రామానికి చెందిన దిడ్డి పంపన్న(65)బుధవారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన బంధువులు వెంటనే ఆలూరు ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. బంధువుల వివరాల మేరకు. ఆలూరులో టీడీపీ టికెట్ సుజాతమ్మకు రావడం కష్టమని వస్తున్న వదంతులు నమ్మి తీవ్రమనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని పంపన్నను పరామర్శించారు.