ఆలూరు: మంత్రి గుమ్మనూరు జయరాంకు
వైసీపీ షాకిచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను, ఎమ్మిగనూరు
వైసీపీ అభ్యర్థి గా బుట్టా రేణుక ను వైసిపి అధిష్టానం శుక్రవారం ఖరారు చేసింది. ఈ రెండు స్థానాలను
వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించిన గుమ్మనూర్ జయరాం అధిష్టానం ఎంత ప్రయ త్నించినా అందుబాటులోకి రాలేదు.