విద్యుత్ ఘాతంతో బాలుడి దుర్మరణం

29293చూసినవారు
విద్యుత్ ఘాతంతో బాలుడి దుర్మరణం
డోన్ మండలంలోని సీసంగుంతలలో ఓ బాలుడు విద్యుత్ ఘాతంతో మృతి చెందినట్లు గ్రామీణ ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన శ్రీను, సుంకులమ్మల రెండో కుమారుడు బోయ జగన్(15) యు. కొత్తపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇంటి ముందు ఉన్న సైకిల్ తీస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి చనిపోయాడని ఎస్సై పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్