వడదెబ్బకు రైతు మృతి

70చూసినవారు
వడదెబ్బకు రైతు మృతి
కోసిగి గ్రామంలోని 2వ వార్డుకు చెందిన బెంగి అయ్యన్న వడదెబ్బకు సోమవారం మృతి చెందారు. మృతుడు పోలంలో పని చేస్తుండగా అకస్మికంగా కుప్పకూలిపోయారు. బంధువులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత నెల రోజుల క్రితం బెంగి అయ్యన్న కుమారుడు గుండెపోటుతో మృతి చెందగా, ఇప్పుడు బెంగి అయ్యన్న మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్