శ్రీ మఠంలో తమిళనాడు డిజిపి వన్నియాపెరుమాళ్

69చూసినవారు
శ్రీ మఠంలో తమిళనాడు డిజిపి వన్నియాపెరుమాళ్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం తమిళనాడు రాష్ట్ర డిజిపి వన్నియాపెరుమాళ్ శనివారం వచ్చారు. వీరికి శ్రీ మఠం సహయ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి స్వాగతం పలికారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని , ప్రత్యేక పూజలు చేసి , మంగళహారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్రస్వామి నిజ మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు శేషవస్ర్తంతో ఆశీర్వదించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్