నంద్యాల: విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తాం: ఎస్పీ

72చూసినవారు
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదిదారుల నుంచి 95 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడ్డిపిఓ మంద జావళి ఆల్ఫోన్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్