స్వచ్ఛతే సేవా నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

58చూసినవారు
స్వచ్ఛతే సేవా నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
స్వచ్ఛతే సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. గురువారం జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, మాట్లాడారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంపై గ్రామాల్లో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలను భాగస్వాములు చేసి విజయవంతం చేసేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్