వైసీపీ పార్టీ వీడి టిడిపిలోకి 25 కుటుంబాలు చేరిక
రుద్రవరం మండల పరిధిలోని అప్పనపల్లె గ్రామానికి చెందిన సుద్దుల ప్రసాద్ యాదవ్ మరియు యర్రం ప్రతాపరెడ్డి అధ్వర్యంలో మంగళవారం పెద్ద కంబలూరు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వీరికి భూమా భార్గవ్ రామ్ నాయుడు టీడీపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపిలో చేరిన ఎస్సీ కాలనీకి చెందిన వార్డు మెంబర్ పుల్లమ్మ, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షులు గుర్రప్ప వీరితోపాటు పలువురిని నాయుడు అభినందించారు.