ఏపీలో పండిన మిర్చి గుంటూరు యార్డు ద్వారా ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్కు ఎగుమతయ్యేది. అయితే ఇటీవలి కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాలకు ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో మిర్చి ఎగుమతుల తగ్గిపోయి.. నిల్వలు పెరిగిపోయాయి. గతేడాది గరిష్టంగా క్వింటాల్ మిర్చి ధర రూ.26 వేల వరకు పలికింది. ఈ ఏడాది కూడా అధిక ధరలు వస్తాయన్న ఆశతో రైతులు అప్పులు చేసి మరీ మిర్చి సాగు చేశారు.