ఇద్దరు IPSలపై సస్పెన్షన్ ఎత్తివేత

61చూసినవారు
ఇద్దరు IPSలపై సస్పెన్షన్ ఎత్తివేత
ఐపీఎస్ అధికారులు బిందుమాధవ్, అమిత్ బర్దార్‌లపై సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోవడంలో వీరు విఫలమయ్యారని వీరిపై ఈసీ వేటు వేసింది. మే 16న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్