ఏపీ అసెంబ్లీ, లోక్సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ కూటమి, వైసీపీ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని వెల్లడైంది. అయితే మెజార్టీ సంస్థలు అధికారం టీడీపీ కూటమిదే అని వెల్లడించాయి. లోక్సభ ఎగ్జిట్ పోల్స్లోను మెజార్టీ సంస్థలు టీడీపీ కూటమికే పట్టం కట్టాయి.