రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు భారీ సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1200 మంది రాజీనామా చేశారని సమాచారం. అటు తాడిపత్రిలోనూ 300 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పెన్షన్లు, రేషన్ పంపిణీలో పాల్గొనకుండా వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారీ సంఖ్యలో రాజీనామాలు చర్చనీయాంశంగా మారాయి.