గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించి భారత ప్రభుత్వం మొత్తం రూ.1,500 కోట్లు ఇచ్చేలా ఇరు దేశాల మధ్య ఈ ఏడాది జనవరిలో అవగాహన ఒప్పందం కుదిరింది. తొలివిడతగా జనవరి 28న రూ.500 కోట్లను విడుదల చేసింది. రెండో విడతతో ఈ మొత్తం రూ.వెయ్యి కోట్లకు చేరింది.