టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై వైసీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ మండిపడ్డారు. వాలంటీర్లపై వ్యాఖ్యలు దారుణమన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ చేసిన చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారని భరత్ అన్నారు.