విశాఖ డ్రగ్స్ కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, బ్రెజిల్కు నగదు లావాదేవీలపై ఇప్పటికే ఆరా తీసింది. సీబీఐ బృందం బ్రెజిల్కు వెళ్లి విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. జర్మనీకి వెళ్లిన నౌక రెండు రోజులు అక్కడే ఎందుకు ఆగిందనే కోణంలో విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.