ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని గ్రామ టీడీపి నాయకులు అన్నారు. గురువారం ఆదోని మండలం సలకలకొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, షూష్, యూనిఫాం అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని క్రమశిక్షణతో చదివితే సాధించలేనిది ఏదీ లేదన్నారు.