ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఆలూరు టీడీపి అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆదివారం మంగళగిరి పార్టీ ఆఫీస్ నంద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలో టీడీపి ఓటమికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆలూరు నియోజకవర్గం ప్రజల కోసం వేదవతి ప్రాజెక్ట్, నగరడోన రిజర్వాయర్ కు నిధులు కేటాయించి త్వరగా పూర్తిచేయాలని, ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు.