టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో ఇండియా సేఫ్ ప్లేస్లో ఉంది. 4 పాయింట్లు, +2.425 నెట్రన్ రేట్తో ఉంది. చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో అత్యంత భారీ తేడాతో ఓడితే తప్ప టీమిండియా సెమీస్ చేరుకోవడం ఖాయం. ఇక, 2 పాయింట్లు, -0.650 నెట్రన్ రేట్తో ఉన్న అఫ్గాన్ తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించాలి. టీమిండియాతో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోతే అఫ్గాన్ నేరుగా ఫైనల్ చేరుతోంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే రన్రేట్ కీలకం అవుతుంది.