ఉద్యోగ, ఉపాధికి కంప్యూటర్ కోర్సులు దోహదపడతాయని ఎమ్మెల్యే కోట్ల సూచించారు. శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం డోన్ పట్టణంలోని స్థానిక రోటరీ భవనంలో కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు నిర్వాహకుడు లక్ష్మణసాయి అధ్యక్షతన సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.