డోన్ పట్టణంలోని కంబలపాడు సర్కిల్, ఇందిరానగర్ ప్రాంతలలో జరిగిన ఇంటింటి ప్రచారంలో డోన్ నియోజకవర్గం అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన రాకను పురస్కరించుకొని ప్రజలు వైసిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు భ్రమరథం పట్టారు. డోన్ పట్టణంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అడిగారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.